భోపాల్, మార్చి 25: ‘ప్రధాని మోదీపై ఫిర్యాదా? దాన్ని మేం తీసుకోం, కేసు నమోదు చేయం’ ఇదీ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని భోపాల్ పోలీసులు ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాధానం. ఈ ఘటన రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు ప్రకటన తర్వాత శుక్రవారం భోపాల్లో చోటుచేసుకొన్నది. మోదీపై ఫిర్యాదు చేసేందుకు మనోజ్ శుక్లా అనే స్థానిక కాంగ్రెస్ నేత పోలీసుస్టేషన్కు వెళ్లారు.
కాంగ్రెస్ నేతలపై మోదీ పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేసు నమోదు చేయాలని కోరారు. అయితే అందుకు తిరస్కరించిన ఎస్ఐ.. కేసు రిజిస్టర్ చేసేది లేదని చెప్పారు. అయితే విచారణ చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా మనోజ్ శుక్లా, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.