వయనాడ్ : వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి పీఎం సుధాకర్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక జిల్లా నేతగా రాహుల్ గాంధీ తనకే అందుబాటులో ఉండరని, సామాన్యుడు ఎలా కలవగలడని ప్రశ్నించారు.