గౌహతి: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. వాస్తవానికి అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారమే ప్రచారం ముగిసింది. అయితే ఇవాళ గౌహతిలోని కామాఖ్యా ఆలయాన్ని రాహుల్ విజిట్ చేశారు. కామాఖ్యా అమ్మవారికి పూజలు చేశారు. అస్సామీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అయిదు వాగ్దానాలు చేసినట్లు రాహుల్ తెలిపారు. అస్సాంలో సీఏఏను అమలు చేయమన్నారు. సీఏఏ ద్వారా అస్సామీ భాష, సంస్కృతిపై దాడి జరుగుతోందని రాహుల్ విమర్శించారు. మేం బీజేపీ తరహా కాదు అని, మేం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తామన్నారు. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులకు రోజు కనీసం వేతనంగా రూ.365 ఇస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తామన్నారు. 39 నియోజకవర్గాల్లో అస్సాం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.