న్యూఢిల్లీ: ఒక నాయకురాలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అయితే జైలు సమీపంలో పార్క్ చేసిన ఆమె కారు చోరీ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తన లగ్జరీ ఎస్యూవీ టయోటా ఫార్చ్యూనర్ను తీహార్ జైలు సమీపంలోని జనక్పురి మెయిన్రోడ్డులో పలు బ్యాంకు శాఖలు ఉన్న చోట పార్క్ చేశారు. అయితే ప్రచారం ముగించుకుని వచ్చి చూడగా ఆమె కారు మాయమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఒక కారు నుంచి దిగిన వ్యక్తి 15 నిమిషాలు శ్రమించి ఎస్యూవీ వెనుక డోర్ అద్దాలు బద్ధలుకొట్టాడు. అనంతరం ముందు డోర్ తెరిచి కారును నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ నాయకురాలు పంఖూరీ పాఠక్కు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘తీహార్ జైలు ఎదురుగా ఈ సంఘటన జరుగడంతో ఢిల్లీ ఎంత సురక్షితంగా ఉందో మీరే ఊహించవచ్చు. అవమానకర సంఘటన’ అని విమర్శించారు.
कई मिनट तक गाड़ी चोरी का प्रयास चलता रहा ।
चोरों ने पहले अन्य तरह से गाड़ी खोलने की कोशिश करी, नहीं खुलने पर चले गए।
फिर एक चोर स्कूटी में आया और सारे CCTV ki फोटो वीडियो बनाई।
फिर चोरों की गाड़ी आई और एक ने खिड़की और लॉक तोड़ा और फिर भाग गए ।
उसके बाद फिर आए और गाड़ी ले गए। https://t.co/zS1DhyA4Os pic.twitter.com/APB8UtLDWW— Pankhuri Pathak पंखुड़ी पाठक پنکھڑی (@pankhuripathak) November 24, 2022