శ్రీనగర్, డిసెంబర్ 3: భారత మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును తక్కువ చేసేలా జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ మాట్లాడారు. పద్మభూషణ్ ఒక చిన్న అవార్డు అని అన్నారు. కాంగ్రెస్ మాజీ నేత గులాంనబీ ఆజాద్ను విమర్శించే క్రమంలో రసూల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఓ ర్యాలీలో వికార్ రసూల్ మాట్లాడుతూ.. పద్మభూషణ్ అనే చిన్న అవార్డు కోసం గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ను మోసం చేశారని ఆరోపించారు. పార్టీ వల్లే ఆయనకు పదవులు వచ్చాయని అన్నారు. పద్మభూషణ్ అనే చిన్న అవార్డు పొందిన తర్వాత ఆయన తన పునాదినే మర్చిపోయారని వ్యాఖ్యానించారు.