దోడా: కాంగ్రెస్ పార్టీపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు కొన్నిసార్లు తనకు అనిపిస్తుంటుందని అన్నారు. ‘బీజేపీతో కాంగ్రెస్ జట్టుకట్టిందేమోనని కొన్ని సార్లు నాకు అనుమానం కలుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పుల కోసం పార్టీలోని 23 మంది పోరాడినా అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు. సమస్య వివరించిన ప్రతీసారి తమది బీజేపీ భాష అంటూ హైకమాండ్ విమర్శించేది’ అని ఆయన తెలిపారు.