అహ్మదాబాద్: లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి కనీసం ఒక ముస్లిం అభ్యర్థిని కూడా కాంగ్రెస్ బరిలో నిలపలేదు. భరూచ్ లోక్సభ స్థానం నుంచి గతంలో ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇస్తూ ఉండేది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వల్ల ఈ స్థానం ఆ పార్టీకి వెళ్లింది. కాగా, రాష్ట్రం నుంచి మొత్తం 35 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో కొందరు స్వతంత్రులు, మరికొందరు చిన్న పార్టీల టికెట్లపై పోటీ చేస్తుండగా, గాంధీ నగర్ స్థానం నుంచి ముస్లిం అభ్యర్థిని బీఎస్పీ నిలిపింది.