న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కావాలనే నీరుగార్చుతున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ పథకానికి నిధులను విడుదల చేయకుండా పరోక్షంగా నామరూపాలు లేకుం డా చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
పారదర్శకత పేరుతో డిజిటలైజేషన్ను ప్రవేశపెడుతూ పథకాన్ని అణగదొక్కుతున్నదని విమర్శించారు. మోదీ ప్రభుత్వ చర్య వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.