Paras Saklecha | సినిమా వాళ్లు, పొలిటీషియన్స్, వ్యాపారులు సెంటిమెంట్లను బాగా నమ్ముతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో ఓ మెట్టు ముందుంటారు. ఎన్నికల్లో గెలిచేందుకు, ప్రజల మన్ననలు పొందేందుకు వారికి కలిసొచ్చే పని ఏదైనా సరే నిర్మొహమాటంగా చేసేస్తారు. అలా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి (Congress candidate) ఇలాంటి సెంటిమెంట్నే ఫాలో అయ్యాడు. అయితే, అతను ఎవరూ ఊహించని విధంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఫకీర్ బాబాతో చెప్పుతో కొట్టించుకున్నాడు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన పరాస్ సక్లేచా (Paras Saklecha) తన గెలుపుకోసం ఓ బాబాతో చెప్పుతో కొట్టించుకున్నాడు. పరాస్ ముందుగా ఓ జత కొత్త చెప్పులు కొనుక్కొని.. రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా వద్దకు వెళ్లాడు. అతడికి ఆ చెప్పులు ఇచ్చి వాటితో కొట్టించుకున్నాడు. అతడి తలపై, చెంపపై చెప్పుతో కొడుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
pic.twitter.com/OETaX3mFbn#मध्य_प्रदेश– रतलाम में फकीर बाबा से आशीर्वाद लेने पहुंचे कांग्रेस के प्रत्याशी पारस सकलेचा को चप्पल से पीट कर दिया आशीर्वाद, वीडियो हुआ वायरल। #MadhyaPradeshElections #MadhyaPradesh #MPNews #Election #Election2023 #ParasSaklecha #Ratlam #LatestNews
— Mr Jyani (@skjyani01) November 17, 2023
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 6 గంగలకే పోలింగ్ ప్రారంభమైంది. 2533 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో 47 స్థానాలను ఎస్టీ, 35 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, మండ్ల, దిందోరి జిల్లాలో కేవలం 3 గంటల వరకే పోలింగ్ జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64, 626 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు.
Also Read..
Horse | విమానంలో అనూహ్య ఘటన.. బోనులోంచి తప్పించుకున్న గుర్రం
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్గా వాయుసేన విన్యాసాలు
Raw Eggs | వంద పచ్చిగుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్.. వీడియో