అహ్మదాబాద్: ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని తడబడింది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’కు బదులు ‘ఇండియా ఎయిర్లైన్స్’కు ఓటు వేయాలని ప్రజలను కోరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Vote for ‘INDIA Airlines’) గుజరాత్లోని బనస్కాంత లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జెనిబెన్ నాగాజీ ఠాకోర్ పోటీ చేసింది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె తడబడింది. ‘ఈసారి భారతదేశం, గుజరాత్ ప్రజలు ‘ఇండియా ఎయిర్లైన్స్’కు తమ ఆశీర్వాదం అందించి, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థిని జెనిబెన్ ఇటీవల మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’కు బదులు ‘ఇండియా ఎయిర్లైన్స్’కు ఓటు వేయాలన్న ఆమె వ్యాఖ్యలపై పలువురు కామెంట్లు చేశారు. మరోవైపు గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకుగాను మంగళవారం జరిగిన మూడో దశలో 25 స్థానాల్లో పోలింగ్ జరిగింది.
Video of Congress candidate from Gujarat asking voters to vote for INDIA AIRLINES instead of INDI Alliance goes viral on social media. pic.twitter.com/DCyd7DIOtS
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 8, 2024