న్యూఢిల్లీ, మే 19: ప్రస్తుతం అమలులో ఉన్న నేర చట్టాలను ప్రక్షాళన చేస్తూ, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. కేంద్రం గత ఏడాది డిసెంబర్ 21న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను ప్రవేశపెట్టగా పార్లమెంట్ వాటిని ఆమోదించింది.
అయితే పార్లమెంట్లో సమగ్ర చర్చ చేపట్టకుండా ఈ బిల్లులను ఆమోదించారని, దీనిపై స్టే విధించాలని న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని వేయాలని కోరారు.