ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రతరమవడంతో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో గురువారం సాయంత్రం ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు హెచ్కే పాటిల్, బాలాసాహెబ్ థొరట్, నానా పటోల్, అశోక్ చవాన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.
రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకుని సీఎంతో చర్చలు జరిపితే ఎంవీఏ సర్కార్ నుంచి శివసేన బయటకు వస్తుందని సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అత్యవసర భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. శివసేన ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కాంగ్రెస్ చెబుతోంది.
ఎంవీఏ సర్కార్ను కూలదోసేందుకు కాషాయ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు గౌహతిలో రెబెల్ ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే ఏర్పాటు చేసిన క్యాంప్లో పలువురు సేన ఎమ్మెల్యేలున్నారు. రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరగడంతో ఏక్నాథ్ షిండే తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో తనకు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే చెబుతున్నారు.