Congress | ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అటు ప్రధాని మోదీ, ఇటు ద్రవ్యోల్బణం రెండూ దేశానికి హానికరమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినిత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మోదీ ఉంటే ద్రవ్యోల్బణం ఉన్నట్లే అని విమర్శించారు. ఇక జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్తో పోలుస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నూతన సంవత్సరం కానుకగా బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దేశ ప్రజలకు బహుమానంగా ఇచ్చిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగిత 2 శాతంగా ఉంటే, ప్రస్తుతం 10 శాతంగా ఉందని, అయినా కేంద్రం దృష్టి సారించడం లేదని సుప్రియా మండిపడ్డారు.