న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పినరయి విజయన్లు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. వీరు లాలూచీ పడకపోతే కేరళ సీఎం పినరయి విజయన్పై గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను ఎందుకు నమోదు చేయాలేదని ప్రశ్నించారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసును మరుగునపడేసేందుకు అదానీ గ్రూప్ నుంచి రూ 8700 కోట్ల విలువైన పవన విద్యుత్ను కొనుగోలు చేయాలని కేరళ సీఎం, ప్రధాని మోదీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కేరళ అసెంబ్లీ ఎన్ని.కల నేపథ్యంలో తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రణ్దీప్ సుర్జీవాలా విలేకరులతో మాట్లాడారు. సౌర విద్యుత్ యూనిట్కు రూ 1.90కి అందుబాటులో ఉండగా ఈ విద్యుత్ రూ 2.90కు కొనుగోలు చేస్తున్నారని యూనిట్కు రూపాయి అదనంగా వెచ్చిస్తున్నారని సుర్జీవాలా పేర్కొన్నారు.