కోల్కతా, ఏప్రిల్ 15: కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్లో మిగతా దశల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని మొదట్లోనే వ్యతిరేకించామని గురువారం ట్విట్టర్లో గుర్తుచేశారు. మలి దశ పోలింగ్ శనివారం జరగనున్నది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. చివరి మూడు దశలు ఈ నెల 22, 26, 29 తేదీల్లో జరుగనున్నాయి. వీటిని కలిపి ఒకేసారి నిర్వహిస్తారన్న గురువారం ఊహాగానాలు మొదలయ్యాయి. అలాంటి ఆలోచనేమీ లేదని ఈసీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.