న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి ఈనెల 23, 24 (శని, ఆదివారం) తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ అమలు చేయాలని పినరాయి విజయన్ ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు మూడు లక్షల టెస్టులతో భారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది.
గత వారాంతంలో లాక్డౌన్కు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేరళలో తాజాగా అత్యధికంగా 16,848 పాజిటివ్ కేసులు నమోదవగా దేశవ్యాప్తంగా వెలుగుచూసిన కేసుల్లో ఇవి 42 శాతం కావడం గమనార్హం. ఈద్ నేపథ్యంలో కేరళలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.