చెన్నై: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన రాజదండం ‘సెంగోల్’ మరోసారి తెర మీదకు వచ్చింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి, సెంగోల్కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధానికి సెంగోల్ను అందించిన తమిళనాడులోని తిరువదుతురై అధీనం మఠం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో పోస్టు వైరలైంది. రాజదండం తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఉన్నదనే దానికి ఒడిశా ప్రమాదం సంకేతమని మఠాధిపతి చెప్పినట్టుగా ఈ పోస్టు ఉంది. ఇది తప్పుడు ప్రచారమని మయిలదుతురై ఎస్పీకి అధీనం జనరల్ మేనేజర్ రాజేంద్రన్ ఫిర్యాదు చేశారు.