Cold wave: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతున్నది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతోపాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, యూపీలో చలి తీవ్రత పెరిగింది. పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది.
చలి, పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలావుంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.