న్యూఢిల్లీ, డిసెంబర్ 24: చలికి ఉత్తర భారతం గజగజ వణుకుతున్నది. జమ్ము, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది. దేశంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ఠం నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్ మూడు డిగ్రీలకు చేరాయి. చలికి ఇప్పటికే జమ్ము-కశ్మీర్లోని దాల్ సరస్సు సహా పలు నదులు గడ్డకట్టాయి. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తున్నది.