పుణె : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈ నెల 11న మహారాష్ట్ర విద్యా రాజధాని పుణెలో ఆందోళన నిర్వహించనున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెల్లడించింది. సావిత్రిభాయ్ ఫూలే పుణె యూనివర్సిటీ (ఎస్పీపీయూ) ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు ఈ ఆందోళన జరపనున్నట్టు తెలిపింది.
‘కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బొద్దింకలు డిమాండ్ చేస్తాయి. పుణె నుంచి ఎన్ని బొద్దింకలు ఇందులో పాల్గొంటున్నాయి?’ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలపై సీజేపీ ఇప్పటికే ఢిల్లీ జంతర్మంతర్తో ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. తమ ఆందోళనలను ఇతర దేశాల్లో జరిగిన జెన్ జీ ఆందోళనలతో పోల్చవద్దని కోరారు.