లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ్బులు రీఫండ్ చేయండి’ అని ఆదివారం పోస్టు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ అతడి ట్వీట్కు బదులిచ్చింది.