లక్నో: ఉత్తరప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న యూపీ వాసుల్లో కరోనాతో రోజువారీగా బాధ పడుతున్న వారికి ఆపన్న హస్తం అందించారు. ప్రత్యేకించి ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి శుభవార్త చెప్పారు.
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్న వారందరికి 28 రోజుల వేతనాలతో కూడిన సెలవును మంజూరు చేశారు. ఈ మేరకు యూపీ సీఎం సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ప్రభుత్వోద్యోగి మొదలు ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వరకు ఎవరి వేతనంలోనూ కోత విధించరాదని పేర్కొన్నారు. ఈ
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేట్ ఉద్యోగులు సెలవులతోపాటు 28 రోజుల వేతనం తీసుకోనున్నారు. ఈ మేరకు కార్మికశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అన్ని జల్లా కలెక్టరేట్లు, డివిజనల్ కార్యాలయాలకు లేఖలు రాశారు. అయితే, ప్రైవేట్ ఉద్యోగుల్లో కరోనా బారీన పడి, అందుకు ద్రువీకరన పత్రం సమర్పించాల్సి వసుందన్నారు.
ఇదే ఆదేశాలు రాష్ట్ర పరిధిలో మూతపడ్డ సంస్థల, విద్యా సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని యూపీ సర్కార్ తెలిపింది. ప్రభుత్వాదేశాల మేరకు మూతపడ్డ షాపులు, ఫ్యాక్టరీలకు కూడా వర్తిస్తంది. వారి వేతనాల చెల్లింపునకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తారు.