కోల్కతా, మార్చి 8: పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలి పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ ప్రధాని మోదీ.. మమత సర్కార్పై మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలపై ఆదివారం సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. గతంలో రాష్ట్రపతికి సంబంధించి ఒక ఫొటోను విడుదల చేశారు. ‘భారత రాష్ట్రపతి, గిరిజన నాయకురాలిని గౌరవించని వ్యక్తి మీరు. మేం కాదు. రాష్ట్రపతి నిల్చొని ఉంటే, ప్రధాని మోదీ కూర్చున్నారు’ అని మమత కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 మార్చిలో ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి భారతరత్న అందజేస్తున్న ఫొటోను ప్రస్తావిస్తూ, బీజేపీ ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు.