Mamata Banerjee | కోల్కతా, ఏప్రిల్ 4: విషపూరిత పామునైనా నమ్మొచ్చు.. కానీ బీజేపీని మాత్రం నమ్మొద్దు.. అంటూ బెంగాల్ ప్రజలను సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. గురువారం ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, కేంద్ర దర్యాప్తు సంస్థలు సహా బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ కూడా బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, ఎన్నికల నిబంధనల్ని బీజేపీ తుంగలో తొక్కుతున్నదని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేట్టు చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులకు టీఎంసీ లొంగదని మమత తేల్చిచెప్పారు.