CM KCR | మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాలయంలో లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం నాగ్పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్ను కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
నాగ్పూర్ పట్టణమంతా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్ ముఖచిత్రంతో కూడిన ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ (Abki Baar Kisan Sarkar) హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. కాగా, పట్టణంలోని గాంధీబాగ్లో విశాలమైన స్థలంలో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్ఎస్భవన్ను పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు pic.twitter.com/sQgGtTh2Qm
— Namasthe Telangana (@ntdailyonline) June 15, 2023