ఇంఫాల్: మణిపూర్లో కుకీ తెగ ప్రజలు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయడం కుదరదని ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్పష్టం చేశారు. కుకీ తెగకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ప్రత్యేక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వీరిలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల డిమాండ్ను సీఎం బిరేన్ సింగ్ తిరస్కరించారు. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడతామని, ప్రత్యేక పరిపాల న కుదరదని ఆయన పేర్కొన్నారు.ప్రజలెవరూ ఎలాంటి ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.