జైపూర్ : రాజస్ధాన్లో దారుణ ఘటన వెలుగుచూసింది. భిల్వారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్ధిని బాటిల్లో తోటి విద్యార్ధులు మూత్రం కలిపారు. బాలిక పొరపాటున మూత్రం కలిపిన నీరును తాగింది. బాలిక బ్యాగ్లో లవ్ లెటర్ కూడా ఉంచడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్ధానికులు ఆగ్రహంతో నిరసనలకు దిగారు.
నిందితుడు నివసించే ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లేందుకు స్ధానికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. పోలీసులు లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టారు. లుహరియా గ్రామంలోని ప్రభుత్వ హైస్కూలులో చదువుతున్న విద్యార్ధిని తన వాటర్ బాటిల్లో కొందరు విద్యార్ధులు మూత్రం కలిపారని, ఆ నీటిని తాగగా దుర్వాసన రావడంతో తన అనుమానం నిజమైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తన బ్యాగ్లో బాలురు లవ్ యూ అంటూ లవ్ లెటర్ను పెట్టారని తెలిపింది. ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్ధానికులు ఆందోళన చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read More :
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..