న్యూఢిల్లీ, మార్చి 30: శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఘర్షణల్లో 12 మందికి గాయాలయ్యాయి. హిందూ, ముస్లింలు సంయమనం పాటించాలని ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ కోరారు. రామాలయంలో ఏ ఒక్క హిందూ గాయపడలేదని, ఫేక్ న్యూస్ను నమ్మొదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, బెంగాల్లోని హౌరాలో రెండు వర్గాలకు చెందిన వారు రాళ్లదాడికి దిగారు. వాహనాల్ని తగలబెట్టారని, దుకాణాల్ని ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. మూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించారు. గుజరాత్లోని వడోదరలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇండోర్: రామనవమి వేళ మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో విషాదం చోటు చేసుకుంది. గురువారం పటేల్ నగర్లోని బలేశ్వర్ మహదేవ్ జులేలా గుడిలో హవనం జరుగుతున్నప్పుడు గుడిలోని మెట్ల బావి పైకప్పు కూలి 14 మంది చనిపోయారు. సుమారు 30-35 మంది భక్తులు బావిలో పడిపోయారని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. 19 మందిని ప్రమాదం నుంచి రక్షించారు.