పాట్నా: రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. 20 మందికిపైగా పోలీస్ సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. సుమారు 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Clash between police and farmers) బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం చౌసా గ్రామానికి చెందిన పలువురు రైతులు, మహిళలు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలం వద్ద నిరసనకు దిగారు. తమ నుంచి సేకరించిన భూములకు మెరుగైన పరిహారం ఇవ్వాలని, యువకులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాగా, పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రైతులు రాళ్లు రువ్వడంతోపాటు కర్రలతో దాడులు చేశారు. పోలీస్ సిబ్బంది, అధికారులతో సమా సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.