న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జాతి ప్రక్షాళన కోసం ముస్లింలను ఊచకోత కోయాలంటూ ఇటీవల పలువురు హిందూత్వ ప్రచార సంస్థల నేతల విద్వేష ప్రసంగాలను సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ(CJI NV Ramana)ను కోరారు. హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంతో పాటు, యతి నర్సింహానంద హరిద్వార్లో నిర్వహించిన ఈవెంట్ను ప్రస్తావించారు. నిందితులపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.