న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రాథమిక రాజ్యాంగ నిర్మాణంపై కోర్టు బయట కాదు.. కోర్టు తీర్పుల ద్వారానే వివరిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ అంశంపై వివాదం చేయాలనుకోవటం లేదన్నారు. అవసరమైన సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం దానిపై మాట్లాడుతుందన్నారు.
న్యూఢిల్లీలో ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ, ‘సుప్రీంకోర్టు పని విధానంలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచటంపై దృష్టిపెట్టాం. మానవీయతకు ప్రాధాన్యం పెరిగింది’ అని అన్నారు.