మెయిన్స్కు 13,090 మంది అర్హత
న్యూఢిల్లీ, జూన్ 22: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు 13,090 మంది అర్హత సాధించారు. ఈ నెల 5న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 11.52 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది 1,022 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవాళ్లంతా మెయిన్స్ పరీక్ష కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్-1(డీఏఎఫ్-1) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సందేహాల నివృత్తికి 011-23385271, 011-23098543, 011- 23381125 నంబర్లను సంప్రదించాలని సూచించింది.