న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశ రాజధానిలో సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్లను నూరు శాతం సామర్ధ్యంతో అనుమతించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ (డీడీఎంఏ) నిర్ణయించింది. ఢిల్లీలో 50 లోపు కరోనా వైరస్ కేసులు వెలుగుచూస్తుండటంతో అన్లాక్ ప్రక్రియలో భాగంగా డీడీఎంఏ ఈ నిర్ణయం తీసుకుంది.
పెండ్లిండ్లు, ఇతర వేడుకలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాల్లో 200 మంది వరకూ అనుమతిస్తామని వెల్లడించింది. ఇక సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ల యాజమాన్యాలు విధిగా కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని కోరింది. నవంబర్ 1 నుంచి ఢిల్లీలో వారాంతపు సంతలను అనుమతించాలని డీడీఎంఏ నిర్ణయించింది.