అమరావతి : ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. ఆదివారం చురూ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. బికనీర్, ఫలోడిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గంగానగర్, సవైమాధోపూర్, పిలాని, కోట జిల్లాల్లో వరుసగా 45, 43.7, 43.1, 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలాఉండగా ఇవాళ సాయంత్రం గంగానగర్, చురూ ప్రాంతాల్లో 5.2, 1.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రానున్న నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతాల్లో ఉరుములు, ధూళి తుఫాను సంభవించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.