Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించినట్లు తెలిపారు. వెంటనే స్పందించి గూగుల్ క్రోమ్ను అప్డేట్ చేసుకోవాలని.. లేకపోతే సైబర్ నేరగాళ్ల బారినపడే ప్రమాదం ఉందని ఉందంటూ తాజాగా సెర్ట్ ఈ హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బగ్ ‘CIVN-2024-0103’ పేరుతో అలెర్ట్ను జారీ చేసింది. సెర్ట్ నివేదికలో క్రోమ్ బ్రౌజర్లోని బగ్ కారణంగా విండోస్, మ్యాక్, లీనక్స్ మూడు ప్లాట్ఫారమ్ల వినియోగదారులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈ బగ్ కారణంగా హ్యాకర్లో బ్రౌజర్ని తమ ఆధీనంలోకి తీసుకొని బుక్ మార్క్లు, బ్రౌజింగ్ హిస్టరీని తెలుసుకునే అవకాశం ఉందని పేర్కొంది. బగ్తో హ్యాకర్స్ క్రోమ్ బ్రౌజర్ను రిమోట్గా నియంత్రించగలరని చెప్పింది. ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా తెలియని, అనుమానాస్పద వెబ్సైట్లను ఓపెన్ చేసిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తెలియని ఐడీల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదే సమయంలో గూగుల్ బ్రౌజర్ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అప్డేట్ కోసం మొదట క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. పైన కుడివైపు పైభాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి. అందులో సెట్టింగ్స్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘క్రోమ్’పై క్లిక్ చేసి.. అప్డేట్ వస్తే వెంటనే చేసుకోవాలని సెర్ట్ సూచించింది.