Chiranjeevi | ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) పార్థివదేహానికి టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి (Chiranjeevi) నివాళులర్పించారు. మీడియా సంస్థల అధినేత భౌతికకాయం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన మరణంతో తెలుగు జాతి ఓ పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. రామోజీరావు కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు.
#WATCH | Hyderabad: Film actor and Padma Vibhushan awardee, Konidela Chiranjeevi pays tribute to Eenadu & Ramoji Film City founder Ramoji Rao.
Ramoji Rao passed away while undergoing treatment at Star Hospital in Hyderabad early morning today. pic.twitter.com/ZXKwhm2DVi
— ANI (@ANI) June 8, 2024
Also Read..
Chandrababu | రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళులు
KTR | కష్టపడి పని చేద్దాం.. రాకేశ్ రెడ్డికి ధైర్యం చెప్పిన కేటీఆర్
Ramoji Rao | రేపు రామోజీరావు అంత్యక్రియలు