న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం తెలిపింది. కార్తీ చిదంబరం ఆయన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం 2011లో హోంమంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనా పౌరులకు వీసాలు మంజూరు చేసిన కేసులో కార్తీ చిదంబరంతో పాటు పలువురిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదే కేసులో సీబీఐ ఇటీవల ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకొని.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదైందని పేర్కొన్నారు.
పంజాబ్లోని సెంట్రల్ బ్యూరోలో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న వేదాంత గ్రూప్ కంపెనీ తల్వాండి సాబో పవర్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) టాప్ ఎగ్జిక్యూటివ్ ద్వారా కార్తీ, అతని సన్నిహితుడు ఎస్ భాస్కర రామన్కు రూ.50 లక్షలు లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. విచారణలో భాగంగా నిందితులను విచారించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, కార్తీ చిదంబరం ఈ ఆరోపణలను ఖండించారు. ఇవి వేధింపులేనని ఆరోపించారు.