న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు వచ్చారు. గురువారం ఢిల్లీకి ఆయన చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో శుక్రవారం ఆయన సమావేశమవుతారు. కాగా, 2020 మేలో తూర్పు లఢక్లో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నర్ సంతోష్ బాబుతోసహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు దేశాలు పోటాపోటీగా సైన్యాన్ని మోహరించాయి.
అనంతరం ఉద్రిక్తతల నివారణకు భారత్, చైనా మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు లఢక్లో చైనాతో ఘర్షణ నాటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశానికి చెందిన కీలక మంత్రి భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఒకవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం జరుగుతున్న తరుణంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ సందర్శన ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
#WATCH | Delhi: Chinese Foreign Minister Wang Yi arrives in India. He is likely to meet NSA Ajit Doval and EAM Dr S Jaishankar tomorrow pic.twitter.com/hU2G52CCa5
— ANI (@ANI) March 24, 2022