న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా మరోసారి హద్దు మీరింది. గాల్వన్ లోయలో జనవరి 1న చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. భారత్ సరిహద్దులో గాల్వన్ లోయలో ఇంచు భూమి కూడా విడిచిపెట్టమంటూ జనవరి 1న చైనా సైనికులు దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారని గ్లోబల్ టైమ్స్ ఓ వీడియోను ట్వీట్ చేసింది.
2022 నూతన సంవత్సరం తొలిరోజున గాల్వన్ లోయలో చైనా జాతీయ పతాకం ఎగరవేశారని, ఈ జాతీయ జెండా ఒకప్పుడు బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్పై ఎగిరింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనదని చైనా అధికార మీడియా ప్రతినిధి షెన్ షివీ ట్వీట్ చేశారు. డ్రాగన్ దుర్నీతిపై కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడ్డాయి.
ఈ విషయంలో చైనాకు దీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కొద్దిరోజుల కిందట 1971లో భారత్ సాధించిన అద్భుత విజయాన్ని మనం గుర్తుచేశామని, దేశ భద్రత, విజయం కోసం ఉట్టి మాటలు కట్టిపెట్టి తెలివైన, కఠిన నిర్ణయాలు అవసరమని రాహుల్ వ్యాఖ్యానించారు.