జైపూర్, డిసెంబర్ 16: యుద్ధానికి చైనా సన్నద్ధమవుతుంటే భారత ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని, ముప్పును విస్మరిస్తున్నదని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదని, 20 మంది జవాన్లను బలితీసుకున్నదని ఆరోపించారు. అరుణాచల్లోనూ మన జవాన్లపై దాడికి దిగిందని మండిపడ్డారు. చైనా ఆయుధ సంపత్తిని పెంచుకుంటుండం గమనిస్తే వారు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవేమీ పట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.