న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రొటేషన్ పద్ధతిలో భాగంగా 2026లో జరగనున్న జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షత వహించే ప్రతిపాదనను చైనా తిరస్కరించినట్టు తెలిసింది. రొటేషన్ పద్ధతిలో జీ20కి అధ్యక్షత వహించే క్రమంలో 2024 సమావేశాలకు బ్రెజిల్, 2025లో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో 2026 సమావేశాలకు అమెరికా నేతృత్వం వహించాల్సి ఉండగా, దానికి చైనా అభ్యంతరం చెప్పినట్టు అమెరికా మీడియా తెలిపింది. అయితే అభ్యంతరాలకు గల కారణాలను చైనా వెల్లడించలేదని పేర్కొంది. చైనా వ్యతిరేకతపై వైట్హౌస్ వర్గాలు స్పందించలేదు.