స్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనా ఎల్ఏసీలో.. భారత్తో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. హాట్ స్ప్రింగ్స్కు సమీపంలో ఇటీవల మూడు మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని లడఖ్ చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పాంగోంగ్ సరస్సుపై వంతెనను పూర్తి చేసిన తర్వాత, చైనా భారత భూభాగానికి అత్యంత దగ్గరలో హాట్ స్ప్రింగ్ సమీపంలో మూడు మొబైల్ టవర్లు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
ఇది ఆందోళనకరం కాదా..? మనకు మానవ నివాస గ్రామాల్లో 4జీ సౌకర్యాలు కూడా లేవని, నా 11 గ్రామాలు నియోజకవర్గంలో 4జీ సౌకర్యాలు లేవు లేవన్నారు. అయితే, మూడు మొబైల్ టవర్ల ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా పెద్ద ప్రణాళికతోనే చైనా ఏర్పాటు చేసిందని, తన కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని, దీనికి వెనుక పెద్ద ప్రణాళికతోనే వీటిని ఏర్పాటు చేసి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
After completing the bridge over Pangong lake, China has installed 3 mobile towers near China’s hot spring very close to the Indian territory. Isn’t it a concern? We don’t even have 4G facilities in human habitation villages. 11 villages in my constituency have no 4G facilities. pic.twitter.com/4AhP4TYVNY
— Konchok Stanzin (@kstanzinladakh) April 16, 2022