న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సరిహద్దుల్లో చైనా మళ్లీ కవ్విస్తున్నది. లఢక్లో సమస్యను చర్చలతో పరిష్కరించుకొందాం అని చెప్తూ.. అరుణాచల్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నది. గతవారం తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడటానికి యత్నించాయి. వారి ప్రయత్నాలను భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా కొన్ని గంటల పాటు ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.