PM Modi | న్యూఢిల్లీ: పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును తల్లిదండ్రులు వారి విజిటింగ్ కార్డుగా భావించడం, ఎవరినైనా కలిసినప్పుడు గొప్పలు చెప్పుకోవడం సరికాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిలో మనోధైర్యాన్ని నింపడం చాలా అవసరమన్నారు.
‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ సోమవారం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తామే పోటీపడాలని సూచించారు.