న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ప్రారంభమైన (2015) తరువాత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా మొత్తం 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి అన్ని రాష్ర్టాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలోని చర్చలు ‘వికసిత్ భారత్@2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి’ అనే ఇతివృత్తంపై జరిగాయి. ఎల్ నినో పరిస్థితులపై తలెత్తుతున్న ఆందోళనలను ప్రధాని ప్రస్తావిస్తూ, నీటి సంరక్షణను ప్రోత్సహించాలని, సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని రాష్ర్టాలకు విజ్ఞప్తి చేశారు.