CJI : తాను యోగా చేయడంతో పాటు గత ఐదు నెలలుగా శాకాహారం తీసుకుంటున్నానని, యోగా చేసేందుకు ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకే లేచానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చెప్పారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం ఆయన ఆయుష్ వెల్నెస్ హాలిస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
సంపూర్ణ జీవనశైలిని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నానని, అది మనం ఏం తింటున్నామనే దానితో ఆరంభమవుతుందని, అలాగే వ్యవస్ధలో మనం ఏం ప్రవేశపెడుతున్నామని కూడా అని ఆయన చెప్పుకొచ్చారు. న్యాయమూర్తులు, సహచరులతో కలిపి సుప్రీంకోర్టులో 2000కిపైగా ఉద్యోగులున్నారని వివరించారు.
వీరంతా దైనందిన జీవితంలో ఎన్నో ఫైళ్లతో కుస్తీ పడుతూ పనిఒత్తిడితో సతమతమవుతుంటారని అన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఉద్యోగులందరూ సంపూర్ణ జీవనశైలి అలవరుచుకోవాలని అన్నారు. అత్యాధునిక వసతులు, డాక్టర్లతో కూడిన ఆయుష్ వెల్నెస్ సెంటర్ను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చామని చెప్పారు.
Read More :
Om Bheem Bush | ‘బ్రోచేవారెవరురా’ కాంబో రిపీట్.. ‘ఓం భీమ్ బుష్’ అంటూ వస్తున్న శ్రీవిష్ణు