Chidambaram : రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతల్లోనే వ్యక్తం కావడం లేదు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తున్న తీరు ఆ పార్టీ దుస్ధితికి అద్దం పడుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలని, దేశమంతటా పరిస్ధితిపై తాను మాట్లాడటం లేదని, అయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే ప్రాంతాలు కూడా ఉన్నాయని చిదంబరం వ్యాఖ్యానించారు. అయితే ఆ గెలుపు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయినంతగా ఉంటుందా అనేది తాను చెప్పలేనని ఆయన తేల్చిచెప్పారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలున్నాయా అని ప్రశ్నించగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకుందాం…అప్పుడు తాము ప్రతిపక్షంలో ఉంటామని, విపక్షం పాత్ర కూడా ముఖ్యమే అని చిదంబరం అసలు విషయం బయటపెట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయంలో ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ బీజేపీ అధికంగా ఓట్లు ఆకట్టుకుంటుంది..అందుకే ఆ పార్టీ గెలుస్తోంది..అయితే కాంగ్రెస్ కోలుకుని మెరుగైన ఓట్లు రాబడుతుందా అనేది ప్రశ్నని పేర్కొన్నారు. తాము కర్నాటక, హరియాణ, తెలంగాణలో గతం కన్నా అధిక ఓట్లను రాబడతామని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు. అయితే తాను హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల గురించి జోస్యం చెప్పలేనని స్పష్టం చేశారు.
Read More :
Gutha Sukhender Reddy | ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు