నల్లగొండ : పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్లో చేరాలని తన కుమారుడు అమిత్కు ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
కొందరు నేతలు సహకరించకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయవద్దని అమిత్ నిర్ణయించుకున్నాడని చెప్పారు. సీఎం రేవంత్ బంధువైనప్పటికి తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడా కలవలేదన్నారు. జమిలి ఎన్నిక విధానంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను లోతుగా అధ్యయనం చేశాక స్పందిస్తానని తెలిపారు.