రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్కు సన్నిహిత అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ మంగళవారం దాడులు నిర్వహించింది. సంపాదనకు మించి అక్రమ ఆస్తులున్నాయనే ఆరోపణలపై వేకువ జాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఈడీ తనిఖీలపై బఘేల్ స్పందించారు. బీజేపీ నేరుగా పోరాడలేకపోతున్నది, అందుకే ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ ఈడీతో పోరాటం చేస్తుందన్నారు. ఈడీ మళ్లీ వస్తుందని తాను ఇంతకు ముందే చెప్పానని గుర్తు చేశారు.
ఇదే చివరిది కాదని.. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వీరి (ఈడీ, ఐటీ) ప్రయాణాలు పెరుగుతాయన్నారు. బెదిరింపులు తప్ప పని లేదని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని భూపేశ్ బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు వెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ములాయం అంత్యక్రియాలకు హాజరుకావాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ క మిటీ నుంచి ఆదేశాలు అందాయని, ఈ మేరకు సైఫాయ్కి వెళ్తున్నట్లు చెప్పారు.