రాయ్పూర్: ఎన్నికల్లో నోటా ఆప్షన్ను రద్దు చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డిమాండ్చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’కు ఓటేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. నోటా ఆప్షన్పై బఘేల్ మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల విజయం, ఓటమికి మధ్య ఉన్న తేడా ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలైన సందర్భాలు ఉన్నాయని, ఇది అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నదన్నారు.